శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;శుక్ల పక్షం సప్తమి: రా.1-43 తదుపరి అష్టమి శ్రవణం: మ.2-33 తదుపరి ధనిష్ఠ వర్జ్యం: సా.6-39 నుంచి 8-18 వరకు అమృత ఘడియలు: తె.4-31 నుంచి 6-10 వరకు దుర్ముహూర్తం: ఉ.6-12 నుంచి 7-41 వరకు రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ.6-12 సూర్యాస్తమయం: సా.5-20
మేషం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవత స్మరణ శుభాలను కలిగిస్తుంది.
వృషభం
శుభ సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మిథునం
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.
కర్కాటకం
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
సింహం
ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
కన్య
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల బాగుంటుంది.
తుల
శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారిని కలుపుకొని పోవడం ఉత్తమం. గణేశ అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.
వృశ్చికం
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. కానీ, వాళ్లు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. అనవసర అంశాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. లక్ష్మీ అష్టోత్తరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు
ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.
మకరం
కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం ఉంది. బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.
కుంభం
ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభకరం.
మీనం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.